కాంగ్రెస్​తోనే ప్రజా పాలన

కాంగ్రెస్​తోనే ప్రజా పాలన

సిరికొండ, వెలుగు: కాంగ్రెస్​తోనే ప్రజాపాలన సాధ్యమని రూరల్​ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గడ్కోల్​లో కప్పలవాగుపై రూ.12 కోట్లతో నిర్మించనున్న హైలెవల్​ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలతో ప్రతీ ఒక్కరికి లబ్ధి చేకూరుతోందన్నారు. గడ్కోల్​ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తన గెలుపుకోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కార్యదర్శి వెలమ భాస్కర్​రెడ్డి, కుందేళ్ల శ్రీనివాస్, సంతోష్​ రెడ్డి, ఎర్రన్న పాల్గొన్నారు.

వాడి బ్రిడ్జి పనులకు శంకుస్థాపన

ధర్పల్లి: రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం వాడి లో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ. 9.50 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. వానాకాలంలో వరదల కారణంగా లో లెవల్​బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు ఆటంకం కలుగుతుండడంతో హైలెవల్ ​బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయితే బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించే వారికి తిప్పలు తప్పుతాయన్నారు. వాడి సర్పంచి గంగవ్వ, మండలాధ్యక్షుడు ఆర్మూర్​చిన్న బాలరాజు, లీడర్లు  శ్రీనివాస్, బొర్రన్న, లింబ్యా నాయక్​పాల్గొన్నారు.
డిచ్​పల్లి, ఇందల్వాయి: డిచ్​పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు హైలెవల్​ బ్రిడ్జిలకు రూరల్​ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. డిచ్​పల్లి మండలం నడిపల్లి వద్ద, ఇందల్వాయి మండలం వెంగల్​పాడ్, లింగాపూర్​వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. భూపతిరెడ్డి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.