టీజీ అక్షరాలు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్రెడ్డి

టీజీ అక్షరాలు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్రెడ్డి
  • భాష, సాంస్కృతిక వారసత్వాలే జాతి అస్తిత్వానికి చిరునామా
  • కేబినెట్​నిర్ణయాలపై సీఎం రేవంత్​రెడ్డి ట్వీట్​

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్​కోడ్​ను టీజీగా ప్రకటించడంపై సీఎం రేవంత్​రెడ్డి ట్విట్టర్ వేదిగా స్పందించారు. ‘ఒక జాతి అస్థిత్వానికి చిరునామా.. ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా నిర్ణయించాం. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపం.


రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నం. వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.  వాటిని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నం’ అని రేవంత్​ట్వీట్ చేశారు.