24 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ. 5 పెంపు

24 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ. 5 పెంపు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ మరోసారి పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 106 రూపాయల 54 పైసలకు పెరగగా...లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 27 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్,డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల 44 పైసలకు పెరగగా...డీజిల్ ధర 103 రూపాయల 26 పైసలకు చేరింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయల 12 పైసలకు చేరగా...డీజిల్ ధర 98 రూపాయల 38 పైసలుగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 61 పైసలకు పెరగగా...డీజిల్ ధర 99 రూపాయల 59 పైసలకు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82 పైసలుండగా.. డీజిల్ ధర రూ. 103.94 పైసలకు చేరింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటగా..డీజిల్ ధర కూడా పలు రాష్ట్రాల్లో మార్కులు దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, బిహార్, కేరళ, కర్ణాటక, లడఖ్ లలో డిజీల్ ధర వంద దాటింది. సెప్టెంబర్ 28 తర్వాత లీటర్ పెట్రోల్ పై 5 రూపాయల 20 పైసలు పెరగగా..డీజిల్ పై 6 రూపాయల 30 పైసలు పెరిగింది.