- అందరూ ట్యాంక్ఫుల్లే
- డబ్బాలు, క్యాన్లలోనూ పట్టుకుపోతున్నరు
- గంటల్లోనే ఖాళీ అవుతున్న స్టాక్
- బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు
హైదరాబాద్ సిటీ నెట్వర్క్, వెలుగు: నగరం పెట్రోల్ బంకుల ఎదుట లైన్ కట్టింది. గత 48 గంటలుగా ఏ పెట్రోల్బంకులో చూసినా లైన్లు కట్టి ఫుల్ట్యాంక్పెట్రోల్పోసుకుంటున్న వాహనదారులే కనిపిస్తున్నారు. బుధవారం బంకుల ఎదుట కిలోమీటర్ల మేర కార్లు, ఆటోలు లైన్కట్టడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్పోలీసులు రంగప్రవేశం చేసి క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. బంకుల్లో రద్దీ పెరగడంతో పలు చోట్ల అవుటాఫ్స్టాక్బోర్డులు పెట్టారు.
పంజాగుట్ట, రాజ్భవన్రోడ్డు, బంజారాహిల్స్రోడ్నంబర్10 లో పోలీసులు నిలబడి మరీ వాహనాలను బంకుల్లోకి పంపించారు. సివిల్సప్లయీస్ఆఫీసర్లు రంగంలోకి దిగి నో స్టాక్ బోర్డులు పెట్టిన బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. అన్ని చోట్లా ఉదయం 6 గంటలకే బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకున్నా రెండు మూడు గంటల్లోనే ఖాళీ అయ్యాయి.
చాలా పెట్రోల్ బంకుల వద్ద రూల్స్ విరుద్ధంగా క్యాన్లు, బాటిల్స్ లో పెట్రోల్ పోసుకుంటున్నారు. దీన్ని చాలామంది బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. అయితే, కొన్ని చోట్ల బాటిల్స్ లో పెట్రోల్ పోయకపోవడంతో గొడవలకు దిగుతున్నారు.
ఆటోలు, క్యాబ్చార్జీలు డబుల్
పెట్రోల్కొరతతో ఇదే అదునుగా పలువురు డ్రైవర్లు దండుకున్నారు. ఉదాహరణకు రాయదుర్గ్నుంచి గచ్చిబౌలి టెలికామ్నగర్వరకు ఆటోలో రూ. 30 తీసుకుంటారు. కానీ, బుధవారం నుంచి దీన్ని రూ. 50 చేశారు. రాజేంద్రనగర్కోర్టు నుంచి మెయిన్రోడ్డుకు రోజు రూ. 30 తీసుకునేవారు. కానీ, బుధవారం దీన్ని రూ.50కి పెంచారు. క్యాబ్స్కూడా అడ్డగోలుగా దండుకున్నాయి. ముషీరాబాద్నుంచి అత్తాపూర్వరకు ర్యాపిడోలో బైక్కు రోజు రూ.90 నుంచి 100 అయ్యేది. కానీ బుధవారం రూ. ఏకంగా 180 వరకు తీసుకున్నారు.
డిమాండ్ 5 లక్షల లీటర్లు.. వచ్చేది 2 లక్షలు
నగరానికి రోజుకు 4 నుంచి 5 లక్షల లీటర్ల పెట్రోల్ డిమాండ్ ఉండగా మూడు రోజుల నుంచి 2లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోందని పలువురు బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు ఒకేసారి డబ్బులు చెల్లించి ఆయిల్ కొనాలని, క్రెడిట్ సౌకర్యం తొలగించడం వల్లే ఎక్కువ డీజిల్, పెట్రోల్కొనడం లేదంటున్నారు. పెట్రోల్, డీజిల్అమ్మకాలు సాధారణ స్థితికి చేరాలంటే ఆయిల్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డీలర్స్ కోరుతున్నారు.
టైమ్కు ఆఫీస్కు చేరుకోలే: ముంబై హైవేపై మదీనగూడ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంకుల వద్ద బైకులు, కార్లు, స్కూల్, కాలేజీ బస్సులు బారులు తీరాయి. దీంతో మియాపూర్నుంచి చందానగర్వైపు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది.
మైండ్ స్పేస్ నుంచి బయోడైవర్సిటీ వెళ్లే రోడ్డులోని నాలెడ్జి సిటీ వద్ద ఉన్న ఇండియన్ఆయిల్పెట్రోల్బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టడంతో టీ హబ్ రోడ్డులో, మైండ్స్పేస్ నుంచి బయోడైవర్సిటీ రోడ్డులో ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో ఐటీ ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని ఆఫీసులకు టైంకు చేరుకోలేకపోయారు.
ఇక్కడ బాటిళ్లలో మాత్రమే పోస్తున్నరు: కుత్బుల్లాపూర్లోని అన్ని పెట్రోల్ పంపుల వద్ద రద్దీ కొనసాగింది. బహదూర్ పల్లి వద్ద ఉన్న ఓ పంపు నిర్వాహకులు వాహనదారులను బంక్లోకి అనుమతించలేదు. కేవలం బాటి ల్స్పట్టుకువచ్చిన వారికి మాత్రమే పెట్రోల్ పోశారు. దీంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్పీజీ, సీఎన్జీకి తిప్పలే: ఎల్పీజీ, సీఎన్జీ లేకపోవడంతో ఆటోలు కిలోమీటర్ల మేర రోడ్లపై బారులు తీరుతున్నాయి. లక్డీకాపూల్లోని ఎల్పీజీ ఫిల్లింగ్స్టేషన్నుంచి మొదలుకుంటే కలెక్టరేట్, సంత్నిరంకారి, ఇండియన్పెట్రోల్బంక్ ఇలా చుట్టూరా క్యూ కనిపించింది. ఎర్రమంజిల్లోని బంక్నుంచి ఆటోలు లైన్కట్టి పంజాగుట్ట వరకు బారులు తీరాయి.
