న్యూఢిల్లీ: ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తమ పీఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిను కొత్త రూల్స్ను ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తీసుకొచ్చింది.
నాలుగు దశల్లో..
స్టెప్ 1: సభ్యుడు ఈపీఎఫ్ఓ పోర్టల్లో విత్డ్రాయల్ రిక్వెస్ట్ పెట్టాలి.
స్టెప్ 2: సిస్టమ్ అర్హత చెక్ చేసి, వెంటనే సభ్యుడికి విత్డ్రాయల్ అమౌంట్ను చూపిస్తుంది.
స్టెప్ 3: సభ్యుడు యూపీఐ పిన్ ద్వారా అథరైజేషన్ ఇవ్వాలి. ఇది రియల్ టైమ్లో జరుగుతుంది.
స్టెప్ 4: అథరైజేషన్ పూర్తయిన తర్వాత, ఈపీఎఫ్ఓ సిస్టమ్ ట్రాన్సాక్షన్ను ప్రాసెస్ చేస్తుంది. మూడు రోజుల్లో డబ్బు బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, సంతానం, పెళ్లిళ్లు చేయడానికి, వైద్యం వంటి అత్యవసర పరిస్థితుల కోసం పీఎఫ్ డబ్బును తీసుకోవచ్చు. సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్లో 75శాతం వరకు తీసుకోవచ్చు. కనీసం 25శాతం మొత్తం ఖాతాలో ఉండాలి. ఈ డబ్బుపై 8.25శాతం వడ్డీ చెల్లిస్తారు.
