- పాక్స్లొవిడ్ డ్రగ్స్తో మంచి రిజల్ట్స్: కంపెనీ
వాషింగ్టన్: కరోనా ట్రీట్ మెంట్ కోసం అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ కొత్త యాంటీవైరల్పిల్ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘పాక్స్లొవిడ్’ గా పిలిచే ఈ పిల్ వేసుకుంటే మరణించే, హాస్పిటలైజ్అయ్యే అవకాశాలు 89 శాతం తగ్గినట్టు తమ ట్రయల్స్లో తేలిందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది చివరలో మరో రెండు స్టడీలు చేస్తామని, అమెరికాలో డ్రగ్వాడకానికి అప్రూవల్కోసం త్వరలో అప్లై చేసుకుంటామని చెప్పింది. 775 మందిపై చేసిన ప్రిలిమినరీ ట్రయల్స్ఫలితాలను ఫైజర్శుక్రవారం విడుదల చేసింది. ఫైజర్పిల్తీసుకున్న కరోనా రోగుల్లో హాస్పిటలైజేషన్, డెత్రేటు 89 శాతం తగ్గిందని తెలిపింది. తమ డ్రగ్తీసుకున్న వాళ్లలో 1 శాతం కన్నా తక్కువ మందే హాస్పిటలైజ్అయ్యారని, ఎవరూ చనిపోలేదని చెప్పింది. పాక్స్లొవిడ్ తీసుకున్న పేషెంట్లు ఎవరూ వ్యాక్సిన్ వేసుకోలేదంది. వీళ్లకు లక్షణాలు కనిపించిన 3 నుంచి 5 రోజుల తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్చేశామని తెలిపింది.
మాల్నుపిరావిల్ తర్వాత రెండో డ్రగ్
కరోనాపై పోరాటానికి ఫైజర్తయారు చేసిన పాక్స్లొవిడ్ రెండో డ్రగ్. ఇప్పటికే మెర్క్స్కంపెనీ.. తమ మాల్నుపిరావిల్ ను కరోనా ట్రీట్మెంట్వాడొచ్చని, తమ ట్రయల్స్లో 50% మంచి ఫలితాలు కనిపించాయని ఈ సెప్టెంబర్లో వెల్లడించింది. అప్రూవల్కోసం అమెరికాలో అప్లై చేసుకుంది. డ్రగ్అనుమతికి సంబంధించి ఈ నెలలో మెర్క్స్తో ఎఫ్డీయే మీటింగ్జరగబోతోంది. మాల్నుపిరావిల్వాడకానికి ఇప్పటికే బ్రిటన్అనుమతిచ్చింది. అమెరికాలో ప్రస్తుతం రెమ్డెసివిర్డ్రగ్ను మాత్రమే కరోనాకు వాడుతున్నారు.