టెక్నికల్​ ఇష్యూతో ఇంకా ప్రారంభం కాని పీజీటీ గురుకుల పరీక్ష.. అభ్యర్థుల్లో గందరగోళం

టెక్నికల్​ ఇష్యూతో ఇంకా ప్రారంభం కాని పీజీటీ గురుకుల పరీక్ష.. అభ్యర్థుల్లో గందరగోళం

తెలంగాణ పీజీటీ గురుకుల ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణలో టెక్నికల్​ ఇష్యూ ఏర్పడటంతో అభ్యర్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాబ్లమ్​తో  రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి(ఆగస్టు 21) ఇంగ్లీష్‌ పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు. 

ఉదయం 8:30 గంటలకే పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా, పరీక్షా కేంద్రాల్లోకి ఇంకా అభ్యర్థులను అనుమతించడం లేదు. సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఎక్జామ్​ఆలస్యమైనట్లు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.   

పీజీటీ ఇంగ్లీష్‌ పరీక్ష కోసం కేంద్రాలకు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో పరీక్ష నిర్వహణ ఆలస్యంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.