కొచ్చి: కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని సముద్ర మార్గం ద్వారా తిరిగి మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ఆపరేషన్ సముద్ర సేతు ఫేజ్ – 2 షురూ అయింది. 588 మంది మనవాళ్లతో నేవీ వార్ షిప్ ఐఎన్ఎస్ జలాశ్వ మాల్దీవుల నుంచి శనివారం బయలుదేరినట్లు డిఫెన్స్ అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయానికి కొచ్చికి చేరుకుంటుందని అన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో వారిని తీసుకురావడంలో కొంచెం ఆలస్యం అయినట్లు అధికారులు చెప్పారు. ఈనెల 12న ప్రారంభించిన ‘‘ఆపరేషన్ సముద్ర సేతు ఫేజ్-1”లో భాగంగా
ఇప్పటి కే 698 మంది మనవాళ్లను మాల్దీవుల నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు.