కామారెడ్డి జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

కామారెడ్డి జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోనూ ఫోన్​ట్యాపింగ్​కలకలం రేగింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో కామారెడ్డికి చెందిన కాంగ్రెస్​ లీడర్, అడ్వకేట్ టి.దేవరాజ్​గౌడ్​ ఫోన్​ ట్యాప్​ అయినట్లు సిట్​అధికారులు గుర్తించారు. సదరు లీడర్​కు ఆదివారం సిట్​పోలీసు టీమ్​నుంచి ఫోన్​వచ్చింది. మీ ఫోన్​ట్యాప్​ అయ్యిందని తాము పిలిచినప్పుడు విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నట్లు దేవరాజ్​గౌడ్​ తెలిపారు.  2023 ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీఆర్‌‌ఎస్‌ నుంచి కేసీఆర్,  కాంగ్రెస్​నుంచి రేవంత్​రెడ్డి, బీజేపీ తరఫునకాటిపల్లి వెంకటరమణరెడ్డి పోటీ చేశారు.

 కాంగ్రెస్​ అభ్యర్థిగా బరిలో ఉన్న రేవంత్​రెడ్డి కామారెడ్డిలో ఎన్నికల ప్రచార బాధ్యతల్ని ఆయన సోదరుడు కొండల్​రెడ్డికి అప్పగించారు. కొండల్​రెడ్డితో  ఇక్కడ దేవరాజ్​గౌడ్​సన్నిహితంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో  దేవరాజ్‌ గౌడ్​ ఫోన్​ట్యాప్​అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ర్టవ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన లీడర్ల ఫోన్​ ట్యాప్ అయినట్లు సిట్​బృందం గుర్తించింది. ఈ క్రమంలో కామారెడ్డిలో ఒక నాయకునిదే ఫోన్​ట్యాప్​అయిందా ఇంకా ఏవరివైనా ఫోన్లు ట్యాప్​ అయ్యయా అనేది తేలాల్సి ఉంది.