
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోనూ ఫోన్ట్యాపింగ్కలకలం రేగింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ లీడర్, అడ్వకేట్ టి.దేవరాజ్గౌడ్ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్అధికారులు గుర్తించారు. సదరు లీడర్కు ఆదివారం సిట్పోలీసు టీమ్నుంచి ఫోన్వచ్చింది. మీ ఫోన్ట్యాప్ అయ్యిందని తాము పిలిచినప్పుడు విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నట్లు దేవరాజ్గౌడ్ తెలిపారు. 2023 ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్నుంచి రేవంత్రెడ్డి, బీజేపీ తరఫునకాటిపల్లి వెంకటరమణరెడ్డి పోటీ చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న రేవంత్రెడ్డి కామారెడ్డిలో ఎన్నికల ప్రచార బాధ్యతల్ని ఆయన సోదరుడు కొండల్రెడ్డికి అప్పగించారు. కొండల్రెడ్డితో ఇక్కడ దేవరాజ్గౌడ్సన్నిహితంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దేవరాజ్ గౌడ్ ఫోన్ట్యాప్అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ర్టవ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన లీడర్ల ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్బృందం గుర్తించింది. ఈ క్రమంలో కామారెడ్డిలో ఒక నాయకునిదే ఫోన్ట్యాప్అయిందా ఇంకా ఏవరివైనా ఫోన్లు ట్యాప్ అయ్యయా అనేది తేలాల్సి ఉంది.