
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరరావును సిట్ మూడో రోజు విచారణ ముగిసింది. సిట్ అధికారులు ఆయనను ఈరోజు ( జూన్ 14) 9 గంటలపాటు విచారించారు. తిరిగి ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ప్రభాకరరావును ఆదేశించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్ ఆధారంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకరరావును సిట్ అధికారుల బృందం విచారించింది. రేపటి ( జూన్ 15) నుంచి ఈ కేసులో బాధితుల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, జర్నలిస్ట్ లనుంచి సిట్ సమాచారం సేకరించనుంది. త్వరలో ప్రభాకరరావు ఫోన్ ను సీజ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ను జూన్ 11న విచారించిన సిట్... మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మొదట జూన్ 9 కూడా పోలీసుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారుఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలతో పాటు ఎస్ఐబీ చీఫ్గా కార్యకలాపాలపై ప్రభాకర్ రావును విచారించారు.
ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ల ధ్వంసం తో పాటు డాటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్క్లు తీసి కొత్త హార్డ్ డిస్క్లు పెట్టాలని ఎవరు చెప్పారంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు.