ఫోన్ ట్యాపింగ్ కేసు: మూడో రోజు ముగిసిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ..

ఫోన్ ట్యాపింగ్ కేసు:  మూడో రోజు ముగిసిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ..

 తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ ఎస్​ఐబీ చీఫ్​ ప్రభాకరరావును సిట్​ మూడో రోజు విచారణ ముగిసింది.  సిట్​ అధికారులు ఆయనను ఈరోజు ( జూన్​ 14) 9 గంటలపాటు విచారించారు. తిరిగి ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్​ అధికారులు ప్రభాకరరావును ఆదేశించారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో  ప్రణీత్​రావు ఇచ్చిన స్టేట్​ ఆధారంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకరరావును సిట్​ అధికారుల బృందం విచారించింది. రేపటి ( జూన్​ 15) నుంచి ఈ కేసులో బాధితుల స్టేట్​మెంట్​ను సిట్​ అధికారులు రికార్డు చేయనున్నారు.  రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, జర్నలిస్ట్ లనుంచి సిట్​ సమాచారం సేకరించనుంది.  త్వరలో  ప్రభాకరరావు ఫోన్​ ను సీజ్​ చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు  ను జూన్ 11న విచారించిన సిట్​... మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఈ  కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మొదట జూన్ 9 కూడా పోలీసుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎లో దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారుఫోన్ ట్యాపింగ్ కేసులో మరో  నిందితుడు ప్రణీత్ రావుతో ఉన్న  సంబంధాలతో పాటు ఎస్ఐబీ చీఫ్‎గా కార్యకలాపాలపై ప్రభాకర్ రావును విచారించారు.

ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్‎ల ధ్వంసం తో పాటు డాటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి హార్డ్ డిస్క్‎లను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్క్‎లు తీసి కొత్త హార్డ్ డిస్క్‎లు పెట్టాలని ఎవరు చెప్పారంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు.