రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: చారిత్రక హైదరాబాద్ నగరం, మూసీ నది వారసత్వంపై గీతం యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఫొటో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దక్కన్ ఆర్కైవ్స్ సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. చారిత్రక పత్రాలు, ఛాయాచిత్రాలు, హైదరాబాద్ మహా నగర మ్యాపులు, కొన్ని అరుదైన ఆర్కైవల్ మెటీరియల్ను ప్రదర్శనలో పొందుపరిచారు. మూసీ నదితో హైదరాబాద్కు ఉన్న దీర్ఘకాలిక, సంక్లిష్టమైన సంబంధాలను ఆకర్షనీయమైన కథనాలతో సందర్శకులకు అందుబాటులో ఉంచారు.
పర్యావరణ స్థితి స్థాపన, చారిత్రక జ్ఞాపకాలను కాపాడుకోవాల్సిన అవశ్యకతను ఈ కార్యక్రమం నొక్కి చెప్పిందని వీసీ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తెలిపారు. చరిత్ర ఔత్సాహికులు, హైదరాబాద్ గుర్తింపును అర్ధం చేసుకోవాలనుకునే వారికి, విద్యార్థులకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడుతాయని పేర్కొన్నారు. అనంతరం జీఎస్హెచ్ఎస్లోని లలిత కళల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగు ప్రదర్శనను వీసీ ప్రారంభించి, తిలకించారు. కోర్సు ఫలితాల ప్రదర్శనను ఆయన అభినందించారు.
