
ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతోంది కీర్తి సురేష్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె. వాటిలో ఒక్కో చిత్రంలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోంది. ఇక ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్కు హాజరైన ఆమె టాక్ ద ఆఫ్ ద టౌన్గా నిలిచింది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న ‘హీరామండి’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ లాంచ్ ఇటీవల ముంబైలో నిర్వహించారు. దీనికోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ కో సీఈవో టెడ్ సరండోస్ మన దేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్కు ఆమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ మొదలు.. వెంకటేష్, రానా, అట్లీ లాంటి సౌత్ సెలెబ్రిటీస్ వరకూ చాలామంది హాజరయ్యారు. కృతి సనన్, భూమి పెడ్నేకర్ లాంటి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా హాజరైనప్పటికీ ఆ ఈవెంట్కు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది కీర్తి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మల్టీ కలర్డ్ కాస్ట్యూమ్స్లో స్టైలిష్గా కనిపించిన కీర్తి.. స్టన్నింగ్ లుక్తో అందర్నీ ఆకర్షించింది.