
మనం చాలా వరకు విమానాలకు పక్షులు అడ్డొచ్చాయనే వార్తలు వినే ఉంటాం. కానీ, అహ్మదాబాద్లో మాత్రం ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఎలా వెళ్లిందో కానీ ఒక పావురం విమానంలోకి ప్రవేశించి ప్రయాణికులందరినీ కాసేపు ఆటాడించింది. అహ్మదాబాద్ నుండి జైపూర్కు వెళ్లాల్సిన గోఎయిర్ విమానం బయలుదేరడానికి సిద్ధమవుతుండగా.. అకస్మాత్తుగా విమానంలో పావురం కనిపించింది. దాంతో విమాన సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. విమానంలో పావురం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎగురుతూ ప్రయాణికులందరిని కవ్వించింది. కొంతమంది పావురాన్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ అది ఎవరి చేతికి చిక్కలేదు. దాంతో విమాన సిబ్బంది ఒక డోర్ తెరవడంతో పావురం అక్కడ నుంచి బయటకు తుర్రుమన్నది. అప్పుడు విమానం టేకాఫ్ తీసుకుంది. ఆ పావురం విమానంలోకి రావడం వల్ల విమానం ఆలస్యంగా బయలుదేరింది. దాంతో సాయంత్రం 6:15గంటలకు జైపూర్ చేరాల్సిన విమానం 30 నిమిషాల ఆలస్యంతో 6:45 నిమిషాలకు చేరుకుంది.
So, a bored pigeon boarded the Ahmedabad-Jaipur @goairlinesindia flight yesterday. The video is from a passenger who follows me on Insta https://t.co/M2kqFbip2L#Avigeeks@akananth pic.twitter.com/IqeopU6lV3
— Anantha Krishnan M ?? (@writetake) February 29, 2020
For More News..