టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలి.. వేదిక నాయకులు డిమాండ్​

టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలి.. వేదిక నాయకులు డిమాండ్​

కల్వకుర్తి, వెలుగు: టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి చైర్మన్  జనార్దన్ రెడ్డిని సస్పెండ్  చేయాలని విద్యావంతుల వేదిక నాయకులు డిమాండ్​ చేశారు. ఆదివారం పట్టణంలోని జేఏసీ శిబిరం వద్ద విద్యావంతుల జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి జాతీయ బీసీ కమిషన్  మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు.

కష్టపడి చదువుకున్న వారికి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. పరీక్షలు రద్దు చేయడం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేసిందన్నారు. అభ్యర్థులందరికీ ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని, డీఎస్సీలో పోస్టులు పెంచి నోటిఫికేషన్  ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్  లెక్చరర్లు సుధాకర్, బాలయ్య, రాజేందర్, సదానందం, జంగయ్య, బాలస్వామి గౌడ్, దుర్గాప్రసాద్, నరసింహ పాల్గొన్నారు.