
ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ)- ఇండియా , సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్తో కలిసి మహిళల కోసం ప్లాటినం ఎవారా నోవా నగల కలెక్షన్ను అందుబాటులోకి తెచ్చింది. వీటిని 95శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో రూపొందించామని ప్రకటించింది.
ఈ కలెక్షన్ పై సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సీఈఓ అండ్ ఎండి సువంకర్ సేన్ మాట్లాడుతూ ఈ కలెక్షన్ని విడుదల చేయడానికి పీజీఐతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. వీటి ధరలు రూ. 20 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటాయి. నోవా కలెక్షన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్లలో అందుబాటులో ఉంది.