
ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు.
బుధవారం ( September 17) ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో చేపడుతున్న ఏర్పాట్లపై చైర్మన్ బిఆర్ నాయుడు తో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
►ALSO READ | తిరుపతిలో శ్రీ మహా విష్ణువు విగ్రహంపై రచ్చ రచ్చ : ఏం జరిగింది.. ఎందుకీ వివాదం..?