సీఎం చంద్రబాబుకు .. టీటీడీ ఆహ్వానం... బ్రహ్మోత్సవాలకు రండి..!

 సీఎం చంద్రబాబుకు .. టీటీడీ ఆహ్వానం... బ్రహ్మోత్సవాలకు రండి..!

ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్​ బీఆర్​ నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసారు. ఈ  నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు.

బుధవారం  ( September 17) ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు.  బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో చేపడుతున్న  ఏర్పాట్లపై చైర్మన్ బిఆర్ నాయుడు తో  సీఎం చంద్రబాబు మాట్లాడారు. 

►ALSO READ | తిరుపతిలో శ్రీ మహా విష్ణువు విగ్రహంపై రచ్చ రచ్చ : ఏం జరిగింది.. ఎందుకీ వివాదం..?