ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు 2023 జూలై 28న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ డబ్బులను జమ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 18 వేల కోట్ల రూపాయలను రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
2023 ఫిబ్రవరి 27న కర్ణాటక వేదికగా 13విడత డబ్బులను రిలీజ్ చేశారు. అర్హులైన రైతులు ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా 6 వేల రూపాయలు అందజేస్తుంది. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కు ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అందనున్నాయి.