వ్యాక్సిన్లు, మెడిసిన్లతో పాటు మోడీ కన్పించకుండా పోయారు

వ్యాక్సిన్లు, మెడిసిన్లతో పాటు మోడీ కన్పించకుండా పోయారు

ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మెడిసిన్లతో సహా ఆయన కనిపించకుండా పోయారన్నారు. అయితే.. సెంట్రల్ విస్టా, ఔషధాలపై వస్తు సేవల పన్ను (GST),మోడీ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు రాహుల్.

మరోవైపు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పై కాంగ్రెస్ అనుమానాలు, ఆరోపణల కారణంగానే ఆ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందంటూ కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి విమర్శించారు. అయితే.. ఆ వ్యాఖ్యలను  కాంగ్రెస్ మరో ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ ట్వీట్ల వల్లే వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందా.. అని ప్రశ్నించారు. తన ట్వీట్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం సరిపడా వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టలేదా అని అన్నారు.