సభకు డుమ్మా కొట్టిన బీజేపీ ఎంపీలపై మోడీ ఆగ్రహం

సభకు డుమ్మా కొట్టిన బీజేపీ ఎంపీలపై మోడీ ఆగ్రహం

బీజేపీ ఎంపీలు చాలామంది నిన్న రాజ్యసభకు డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు ప్రధాని మోడీ. ఇవాళ, రేపు సభలో కీలక బిల్లులు ప్రవేశ పెడుతుండటంతో... సభ్యులంతా సోమవారం తప్పకుండా హాజరుకావాలని ముందే ఆదేశాలిచ్చారు. అయినా చాలామంది సభకు రాకపోవడంపై మోడీ అసహనం వ్యక్తం చేశారు. సభకు రాని బీజేపీ ఎంపీల లిస్టు తీసుకున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని మోడీ చెప్పారన్నారు కేంద్రమంత్రి ప్లహ్లాద్ జోషీ. ముఖ్యంగా రూరల్ టాలెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారన్నారు.