నితీశ్ ​కుమార్​కు మోదీ కంగ్రాట్స్

నితీశ్ ​కుమార్​కు మోదీ కంగ్రాట్స్

న్యూఢిల్లీ: బిహార్​లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదు. కొత్త ప్రభుత్వం అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తుందన్న నమ్మకం ఉంది” అని పోస్టులో పేర్కొన్నారు.