వారణాసిలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన మోడీ

వారణాసిలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన మోడీ

వారణాసిలో పర్యటించిన ప్రధాని మోడీ..భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వారణాసిలో రుద్రాక్ష్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 

జపాన్ సాయంతో.. ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు తెలిపారు మోడీ. వారణాసిలోని ఈ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందని తెలిపారు. భారత్, జపాన్ స్నేహ బంధానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఓ నిదర్శనమన్నారు.

2015లో భారత్ లో పర్యటించిన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆర్థికసాయం ప్రకటించారు. ఇది భారతదేశ ఆధ్మాత్మిక నగరం వారణాసికి తాము ఇస్తున్న కానుక అని అన్నారు.