ప్రధాని మోడీ ఓ ఈవెంట్ మేనేజర్

ప్రధాని మోడీ ఓ ఈవెంట్ మేనేజర్

ప్రభాని మోడీ ప్రభుత్వం మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో సెకండ్‌ వేవ్‌కు మోడీనే కారణమని.. ఆయన కరోనా తీవ్రతను అర్ధం చేసుకోలేదన్నారు. వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోడీ తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవ్వడంతో కరోనా సెకండ్‌ వేవ్‌కు కారణమైందన్నారు. అంతే కాదు మోడీ ఓ ఈవెంట్‌ మేనేజర్‌ అని అన్నారు. అయితే ఒకే సమయంలో అన్ని పనులను చక్కదిద్దలేరన్నారు. ఒకే ఈవెంట్‌పై ఫోకస్‌ అంతా పెట్టి..దాని గురించి మాట్లాడతారని ఆరోపించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తమకు ఇటువంటి ఈవెంట్‌ మేనేజర్‌ వద్దని.. సమర్థవంతమైన, వేగవంతమైన పరిపాలన అవసరమన్నారు రాహుల్. 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ స్పీడ్ గా జరగక పోతే...మూడు...నాలుగు వేవ్‌లు కూడా వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు రాహుల్.