ఒత్తిడి ఉంటది.. అయినా తట్టుకుంటం..అమెరికా టారిఫ్ లపై ప్రధాని మోదీ

ఒత్తిడి ఉంటది.. అయినా తట్టుకుంటం..అమెరికా టారిఫ్ లపై ప్రధాని మోదీ
  • ఒత్తిడి పెరుగుతది..పర్లేదు తట్టుకుంటం: ప్రధాని మోదీ 
  • అమెరికా టారిఫ్​ల డెడ్​లైన్ పై మోదీ కామెంట్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  భారత్​ పై విధించిన అదనపు సుంకాలకు ఈ రోజు (మంగళవారం) తో డెడ్ లైన్ ముగియనుంది. బుధవారం నుంచి 25 శాతం అదనపు సుంకాలు అమలులోకి రానున్నాయి. దీంతో అమెరికాకు ఎగుమతయ్యే భారత వస్తువులపై మొత్తంగా 50 శాతం టారిఫ్​ను వసూలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. అమెరికా టారిఫ్​లతో దేశంపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. అయితే, పెరిగే ఒత్తిడిని తట్టుకునే శక్తి భారత్​కు ఉందని ఆయన స్పష్టం చేశారు. 

ఎంత ఒత్తిడి తీసుకొచ్చిన సరే రైతులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని మోదీ తేల్చిచెప్పారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత 25 శాతం టారిఫ్​లు విధించారు. ఆ తర్వాత యుద్ధం ఆపాలంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్ పై అదనంగా 25 శాతం టారిఫ్ లు విధించారు.

పీఎంఓలో  హైలెవల్​ మీటింగ్

భారత్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధిస్తున్న టారిఫ్​లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించేందుకు ప్రధానమంత్రి ప్రిన్సిపల్​ సెక్రటరీ ఆధ్వర్యంలో మంగళవారం హైలెవల్​ మీటింగ్​ జరిగే అవకాశం ఉంది.