దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాల యత్నం

 దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాల యత్నం

స్వార్థపూరిత రాజకీయాలకు దేశం ఎన్నటికీ బంధీగా మారబోదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్ ను, దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 130 కోట్ల మంది ప్రజలు ప్రతీ సవాల్ ను ఎదుర్కొని... దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మోడీ చెప్పారు. దేశం కొత్త రికార్డులు సెట్ చేస్తున్న ఈ టైమ్ లో... కొందరు మాత్రం పార్లమెంట్ ను అడ్డుకుంటున్నారన్నారు. నవ భారతానికి అంతర్జాతీయ గుర్తింపు ర్యాంకుల రూపంలో కాకుండా మెడల్స్ రూపంలో వస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లబ్ధిదారులతో మోడీ ఇంటరాక్ట్ అయ్యారు.