సైనికులతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ

సైనికులతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ

దీపావళి సందర్భంగా ప్రధాని మోడీ కార్గిల్‌లో అడుగుపెట్టారు. అక్కడి సైనికులతో కలిసి దివాళీ జరుపుకునేందుకు ప్రధాని అక్కడికి వెళ్లినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. ఏటా దీపావళిని ప్రధాని మోడీ సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి ఆయన జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకుంటున్నారు. అదే తరహాలో ఈ ఏడాదీ కార్గిల్ లోని సైనికులతో సంబరాలు చేసుకునేందుకు మోడీ బయలుదేరారు. 

అంతకు మునుపు ప్రధాని మోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ అయోధ్య పర్యటన చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని రాముడిని కోరుకున్నట్టు తెలిపారు. మన దేశంలోని సంస్క-ృతి ఇంకెక్కడా లేదని కొనియాడారు.