రేపు రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు

రేపు రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు

రేపు(సోమవారం) తొమ్మిదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు రైతుల  ఖాతాల్లో నగదు జమ కానుంది. వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా 9 కోట్ల 75 లక్షల రైతుల ఖాతాల్లో 19 వేల 500 కోట్లు జమకానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ప్రతీ 4 నెలలకు ఒక సారి 2 వేల చొప్పున మూడు దఫాల్లో నగదు జమకానుంది.