ప్రధాని మోడీ ఏం చెబుతారో…అందరిలోనూ ఆసక్తి

ప్రధాని మోడీ ఏం చెబుతారో…అందరిలోనూ ఆసక్తి
  • రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగం

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. పీఎంఓ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో ప్రధాని మోడీ ఏం చెబుతారోనని అందరిలోనూ అటెన్షన్ మొదలైంది. మూడోసారి విధించిన లాక్ డౌన్ ఈ నెల 17 తో ముగియనుంది. ఆ తర్వాత ఎంటన్నదీ దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో క్వశ్చన్ మార్క్ గానే ఉంది. మళ్లీ లాక్ డౌన్ పొడగిస్తారా లేదంటే ఆంక్షలను చాలా వరకు సడలిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. సోమవారమే సీఎం లతో సమావేశమైన ప్రధాని మోడీ దీనిపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఐతే ఇప్పటికే చాలా సడలింపులు ఇవ్వటంతో మళ్లీ లాక్ డౌన్ కొనసాగించకపోవచ్చని తెలుస్తోంది. ఐతే ఇటీవల కరోనా కేసులు రోజురోజుకు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. దీంతో వాటిని నివారణకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ నెల 17 తర్వాత మరిన్ని సడలింపులపైనే ప్రధాని ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.