ఫ్రాన్స్ చేరుకున్న మోడీ.. అనంతరం యూఏఈ సందర్శన

ఫ్రాన్స్ చేరుకున్న మోడీ.. అనంతరం యూఏఈ సందర్శన

రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి పారిస్‌కు చేరుకున్నారు. జులై 15న ఫ్రాన్స్ నుంచి తిరుగు ప్రయాణం కానుండగా.. ఈ పర్యటనలో ప్రధాని యూఏఈని కూడా సందర్శించనున్నారు. జూలై 14న జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాన మంత్రి గౌరవ అతిథిగా హాజరవుతారు. ఇక్కడ ట్రై-సర్వీసెస్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్స్ కంటెంజెంట్ పాల్గొంటుంది.

ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లే ముందు తన ఫ్రాన్స్ పర్యటన గురించి ట్వీట్ చేశారు. "అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇతర ఫ్రెంచ్ ప్రముఖులతో ఉత్పాదక చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి ఫ్రాన్స్ ప్రధానితో పాటు సెనేట్, ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులను కూడా కలవనున్నారు. ఫ్రాన్స్‌లోని భారతీయ ప్రవాసులు, భారతీయ, ఫ్రెంచ్ కంపెనీల సీఈఓలు, ప్రముఖ ఫ్రెంచ్ వ్యక్తులతో ఆయన విడివిడిగా సంభాషిస్తారని పర్యటనకు ముందు ప్రభుత్వ పత్రికా ప్రకటన తెలిపింది.

ఇక ప్రధాని ఫ్రాన్స్ పై అత్యంత ఆసక్తి చోటుచేసుకుంది. ఎందుకంటే ఈ పర్యటనలో ఆయన అనేక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ఫలితంగా ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరుదేశాల నేతలు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని.. ఫ్రాన్స్ లో డిజిటల్ పేమెంట్స్ టెక్నాలజీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ లేదా యూపీఐని ప్రారంభించనుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఒప్పదం జరిగితో ఐరోపాలో ఈ వ్యవస్థను కలిగి ఉన్న రెండో దేశంగా ఫ్రాన్స్ అవతరిస్తుంది. ఇటీవలే యూపీఐ పేమెంట్లపై పేనౌతో ఒప్పందం కూదుర్చుకున్నసింగపూర్.. ఇరుదేశాల వారితో లావాదేవీలు చేసే పద్దతిని అమల్లోకి తెచ్చింది. ఫ్రాన్స్ లో త్వరలో యూపీఐ, రూపే కార్డు సేవలు అందుబాటులోకి రానున్నాని గతేడాది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

 

#WATCH | Prime Minister Narendra Modi departed from Delhi for Paris, France earlier this morning.

He will take part in the Bastille Day celebrations as the Guest of Honour on July 14. During his visit, he will hold discussions with French President Emmanuel Macron and other… pic.twitter.com/nXjlXDwfKv

— ANI (@ANI) July 13, 2023