ఫొటోలు : ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్య రాముడి దర్శనం..

ఫొటోలు : ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్య రాముడి దర్శనం..

అయోధ్య రాముడు కనిపించాడు.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మొదటి సారి భక్త కోటికి దర్శనం ఇచ్చారు. అయోధ్య గర్భగుడిలోని రాముడి విగ్రహం ఫొటోలను అధికారికంగా విడుదల చేసింది ట్రస్ట్. 

బాల రాముడు దివ్య మంగళ స్వరూపంతో హిందూవులు ఉప్పొంగిపోయారు. టీవీల్లో చూసి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠతో బాల రాముడిని వజ్రాలు, బంగారం ఆభరణాలతో అలంకరించారు. కిరీటధారిగా ఉన్న బాల రాముడు.. మెడలో ఎరుపు రంగు డైమండ్ నక్లెస్ ఉంది. బాల రాముడిని ఏడు వారాల నగలతో దివ్య మంగళంగా అలంకరించారు. ఓ చేతిలో విల్లు, మరో చేతిలో బాణం ధరించి ఉన్నాడు బాల రాముడు.