వచ్చాక బాధపడటం కంటే.. రాకుండా జాగ్రత్త పడాలి

వచ్చాక బాధపడటం కంటే.. రాకుండా జాగ్రత్త పడాలి

కరోనా వచ్చాక బాధపడటం కంటే..రాకుండా జాగ్రత్త పడడం బెటరన్నారు  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్.  వ్యాక్సిన్ తీసుకుంటే ఇబ్బంది ఉండదని… ఇచ్చిన చోట నొప్పి ఉండదన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నారు నేతలు. వ్యాక్సినేషన్ తర్వాత నేతలను అబ్జర్వేషన్ లో ఉంచారు డాక్టర్లు. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. వ్యాక్సినేషన్ తీసుకునేందుకు భయం అవసరం లేదన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు. అనవసర భయాలు వద్దన్నారు.