హేమలత లవణం దంపతుల కృషి మరువలేనిది

హేమలత లవణం దంపతుల కృషి మరువలేనిది
  • తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం

వర్ని, వెలుగు : జోగిని వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం దంపతులు ఎంతో కృషి చేశారని వారి చేసిన సేవలను మరువలేమని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుద్రూర్​ మండలం అక్బర్​నగర్​ లోని ప్రకృతి చికిత్సాలయం లో ప్రముఖ సంఘసంస్కర్తలు హేమలత లవణం దంపతుల విగ్రహాలను గురువారం  అగ్రో​ ఇండస్ర్ట్రీస్​ చైర్మన్​ కాసుల బాల్​రాజ్, ఉమ్మడి రాష్ట్ర హస్తకళల మాజీ చైర్మన్​ అమర్​నాథ్​బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రకృతి చికిత్సాలయం ఒక దేవాలయమన్నారు. 

వైద్యం కోసం ఎంతోమంది వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో హాస్పిటల్స్​ తిరిగి రోగాలు నయం కాకపోవడంతో అదే ప్రకృతి ఆశ్రమంలో చేరిన రోగులకు  తక్కువ ఖర్చుతో సిబ్బంది వైద్యం చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​ సురేశ్​ బాబా, తహసీల్దార్​ తారాబాయి, ఎంపీడీఓ భీంరావ్​, రుద్రూర్​ మండల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్, రుద్రూర్​ విండో చైర్మన్​ సంజీవ్​రెడ్డి, విండో మాజీ చైర్మన్​ పత్తిరాము, సంజీవ్, తోట సంగయ్య, షేక్​ఖాదర్, రామాగౌడ్​తదితరులు పాల్గొన్నారు.