పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆందోళన

పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆందోళన

ములకలపల్లి, వెలుగు : పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు సాగు అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని మాదారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలకుపైగా పోడునరికిన భూములే ఆధారంగా జీవిస్తున్న ఆదివాసి పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.  

మాదారం పోడు రైతుల సాగు భూములను సర్వే చేస్తామని నోటీసులు ఇచ్చి సర్వే చేయకుండా అన్యాయంగా పోడు భూములను గుంజుకోవాలని చుస్తున్నా  ఫారెస్ట్ అధికారులు తమ  ప్రయత్నం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సీపీఎం మండల నాయకులు ఊకంటి రవికుమార్,  వినోద్, సాగుదారులు గణప సత్యం, నాగబాబు, సిద్దిని రమణ ఉన్నారు.