మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు జడ్జి ఆర్ఎం శుభవల్లి సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు తెలిపారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని ఓ స్కూల్లో అటెండర్గా పని చేస్తున్న సారా జైపాల్ 2019లో అదే స్కూల్లో ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.
