డబుల్ బెడ్ రూం ఇళ్ల స్కాంలో నలుగురు అరెస్ట్..

డబుల్ బెడ్ రూం ఇళ్ల స్కాంలో నలుగురు అరెస్ట్..

మహబూబ్​నగర్ టౌన్, వెలుగు : పాలమూరులో కొన్ని రోజుల కింద వెలుగు చూసిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల స్కాంలో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​వ్యక్తిగత కార్యదర్శి కొడుకు కాగా, మరొకరు కాంగ్రెస్​ పార్టీకి చెందిన లీడర్​ఉన్నారు. ఈ కేసు వివరాలను శుక్రవారం మహబూబ్​నగర్​రూరల్​ సీఐ రాజేశ్వర్​గౌడ్​ తెలియజేశారు. భగీరథ కాలనీకి చెందిన అరుణకుమార్​రెడ్డికి న్యూ గంజ్​కు చెందిన సిరాజుద్దీన్​ ఖాద్రీ దివిటిపల్లి వద్ద డబుల్​బెడ్​రూమ్​ఇప్పిస్తానని రూ.3.5 లక్షలు తీసుకున్నాడు. ఎంతకూ ఇల్లు ఇప్పించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడు. సిరాజుద్దీన్​ ఖాద్రీ...అరుణ్​కుమార్​రెడ్డి నుంచే కాకుండా ఖాదర్​అనే వ్యక్తితో కలిసి మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ప్రస్తుతం ఖాదర్​ పరారీలో ఉన్నాడు. సిరాజుద్దీన్​ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గరి నుంచి రూ.2.50 లక్షలు, సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా కేంద్రంలోని పుట్నాలబట్టి ఏరియాకు చెందిన మరో బాధితుడు సుధాకర్​ఇచ్చిన కంప్లయింట్​మేరకు పట్టణంలోని ఆల్మాస్​ఖాన్​ వీధికి చెందిన వానగంటి ప్రకాశ్​, బోయపల్లి గేట్​ప్రాంతానికి చెందిన మహ్మద్​ఇర్ఫాన్​లపై కేసు నమోదు చేశారు. వీరు ఒకరికి డబుల్​ బెడ్​రూమ్​ఇప్పిస్తామని రూ.2 లక్షలు, మరో ముగ్గురు నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. హనుమాన్​పురకు చెందిన మరో బాధితుడు సయ్యద్​ కలాం పాషా ఇచ్చిన కంప్లయింట్​మేరకు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న దేవేందర్​ కొడుకు అక్షయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన బాధితుడి నుంచి రూ.30 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసినట్లు తెలిపారు. వీరిని అరెస్టు రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.