కేటీఆర్ కాన్వాయ్పై చెప్పులు విసిరిన వ్యక్తులు అరెస్ట్

కేటీఆర్ కాన్వాయ్పై చెప్పులు విసిరిన వ్యక్తులు అరెస్ట్

మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై చెప్పులు విసిరిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నిరోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేటీఆర్ పర్యటించగా..ఆయన కాన్వాయ్ పై చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి సహా ప్రవీణ్ చెప్పులు విసిరారు. తాజాగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచగా..న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.