పోచారంలో చోరీ కేసును చేధించిన పోలీసులు
ఘట్కేసర్, వెలుగు: పోచారం ఐటీసీ పరిధిలో రియల్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో ఈ నెల 22న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. 350 సీసీ పుటేజీల పరిశీలించి మొత్తం 9 మంది నిందితులను శుక్రవారం రిమాండ్కు తరలించారు.
నాగభూషణం వద్ద రవి అనే వ్యక్తి పదేండ్లుగా డ్రైవర్గా పనిచేస్తుండగా, అతడి స్నేహితుడు ఠాగూర్ పవన్ కల్యాణ్ సింగ్ (27)ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
శంకర్పల్లిలో నాగభూషణం ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకురావడానికి పవన్ కల్యాణ్ను ఇటీవల రవి వెంట తీసుకెళ్లాడు. వాటిని ఎలాగైనా కొట్టేయాలని పవన్ ప్లాన్ వేశాడు. తొలుత తన స్నేహితులైన జవహర్ నగర్, బాలాజీనగర్ కు చెందిన ఇర్ఫాన్, పులిబాబు, ఫయాజ్, నవీన్ కుమార్, దినకర్, లడ్డూ, జహీద్, మహేశ్ కలిసి ఇంటి వద్దరెక్కీ నిర్వహించారు.
ఆ తర్వాత తెల్లవారుజామున 8 నిమిషాల్లో చోరీకి పాల్పడ్డారు. ఆ మరుసటి రోజు వీరంతా రెండు బృందాలుగా గోవాకు వెళ్లాలని ప్లాన్ వేసుకోగా, బాలాజీనగర్లో వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల నుంచి రూ. 84 లక్షల నగదు, కారు, ఆటో, బైక్ను స్వాధీనం చేసుకొని శుక్రవారం రిమాండ్కు తరలించారు.
