ఖిలా వరంగల్ (మామునూర్), వెలుగు: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఓరుగల్లు కాకీలు అలర్ట్ అయ్యారు. వరంగల్ కాజీపేట, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఆర్పీఎఫ్ జీ ఆర్ పీ సిబ్బంది సోదాలు చేపట్టారు. కాజీపేట, మిల్స్కాలనీ సీఐలు సుధాకర్, బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో రైల్వే ప్లాట్ఫామ్స్, ప్రయాణికుల వేటింగ్ పార్సల్ విభాగం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ బృందంతో క్షుణ్ణంగా పరిశీలించారు.
