హయత్నగర్ పసుమాములలో ఓ యువకుడి బర్త్ డే పార్టీలో గంజాయి వినియోగం కలకలం సృష్టించింది. ఓ యువకుడి బర్త్ డే పార్టీ సందర్భంగా పోలీసులు జరిపిన సోదాల్లో గంజాయి లభ్యమైంది. దీంతో అక్కడున్న 29 మంది యువకులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. బర్త్ డే పార్టీ జరిగిన ప్రదేశంలో 11 కార్లు, ఒక బైక్, 28మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న వారి తరఫున స్టేషన్ కు వచ్చిన కుంట్లూర్ కి చెందిన మణికంఠ అనే యువకుడు హల్ చల్ చేశాడు. క్రైమ్ ఇన్స్పెక్టర్ పై చేయి చేసుకొని నెట్టేశాడు. అక్కడ కవరేజీ చేస్తున్న మీడియా వారిని తిట్టాడు. క్రైమ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.