
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద రేపటి బీజేపీ మహాధర్నాకి పోలీసుల అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు కలెక్టరేట్లోని అధికారులకు సౌండ్ పొల్యూషన్ అవుతుందని పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని బీజేపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. కోర్టు అనుమతి రాగానే మహాధర్నా తేదీలను ప్రకటిస్తామని బీజేపీ నేతలు తెలిపారు.