అప్పుడే పుట్టిన పసికందును పడేసిన దుర్మార్గులు..

అప్పుడే పుట్టిన పసికందును పడేసిన దుర్మార్గులు..

అప్పుడే పుట్టిన పసికందును కొంతమంది దుర్మార్గులు చెట్ల పొదల్లో పడేశారు. ఈ అమానుష ఘటన మియాపూర్ లో చోటుచేసుకుంది.ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న చెరువు పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఆడ శిశువు పడేశారు.

పాప గుక్క పెట్టి ఏడుస్తుండడతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు పాపను అంబులెన్స్ ద్వారా కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిశువుకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆడపిల్ల పుట్టిందనే కారణంగా పసికందును వదిలించుకునేందుకు పాప తల్లిదండ్రులు ఇలా పడేసి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.