
సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు అధికారులు. వనస్థలిపురం కేంద్రంగా ద్వారాక సీడ్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాల విలువ దాదాపు 13 కోట్ల 50 లక్షలు ఉంటుందన్నారు. మిర్చి, టమాట, పుచ్చకాయ, సోరకాయ, బీరకాయ విత్తనాల్లో పెద్ద ఎత్తున నకిలీ దందా కొనసాగుతున్నట్లు తెలిపారు. 5 రకాల కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.