నెక్కొండలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసు

నెక్కొండలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసు

నెక్కొండ, వెలుగు: వరంగల్​ జిల్లాలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై  కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నెక్కొండ టౌన్ రైల్వే స్టేషన్​ ఎదురుగా పర్మిషన్లు లేకుండా  బెడ్స్​ఏర్పాటు చేసి, ఎలాంటి అర్హతలు లేకుండా అల్లోపతి చికిత్స చేస్తున్న  ముగ్గురిని ఫేక్ డాక్టర్లను మెడికల్​ కౌన్సిల్​ఆఫీసర్లు గత నెలలో చేసిన తనిఖీల్లో గుర్తించారు. 

రిజిస్ట్రార్​ లాలయ్య కుమార్​, చైర్మన్​ మహేశ్​కుమార్ ​ఫిర్యాదుతో లావణ్య ఫస్ట్​ఎయిడ్​సెంటర్ ​నిర్వాహకుడు రమేశ్​, రుద్రఫస్ట్​ ఎయిడ్​సెంటర్​ నిర్వాహకుడు రవి, అమ్మ ఫస్ట్​ ఎయిడ్​ సెంటర్​ నిర్వాహకుడు అశోక్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

మెడికల్​ కౌన్సిల్​లో రిజిస్టేషన్​ లేని వ్యక్తులు వైద్య సేవలు అందించరాదని, యాంటీ బయోటిక్​, స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్, ల్యాబ్ ​టెస్టులు చేయడం, సైలెన్లు పెట్టడం చట్టారీత్యా నేరమని పేర్కొన్నారు.  అలా చేసేవారిపై ఏడాది జైలుశిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తారని టీఎంసీ పబ్లిక్​ రిలేషన్​ కమిటీ చైర్మన్ నరేశ్ కుమార్​తెలిపారు.