పవన్ ను అడ్డుకున్న పోలీసులు..టూర్ లో ఉద్రిక్తత

పవన్ ను అడ్డుకున్న పోలీసులు..టూర్ లో ఉద్రిక్తత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని టూర్ లో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపేందుకు మంగళగిరికి  వెళ్తున్న పవన్ ను మందడం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు . పవన్ కాన్వాయ్ ను ముందుకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అభిమానులు. పవన్ కాన్వాయ్ పోకుండా ఇనుప కంచె వేశారు. రైతులు, అభిమానులు  ఇనుప కంచె తీసేశారు. దీంతో పవన్ కారు దిగి నడుచుకుంటూ మందడం వైపు వెళ్లారు.