పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది : బండి సంజయ్

 పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది : బండి సంజయ్

పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్-- బీజేపీ ఘర్షణనలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను సన్మానించిన బండి సంజయ్.. పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతుండ్రని ఆరోపించారు. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చిండ్రు అని ప్రశ్నించారు. గూండాలకు తుఫాకుల లైసెన్సు ఇస్తారా..?అని నిలదీశారు. ఈనెల 5న బీఆర్ఎస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మూర్ఖత్వపు బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల విజయం సాధించారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఈప్రాంతంలో ఈటలకు ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. ఈటల కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలైతే తమ కార్యకర్తలపై కేసులు పెడతారా..?అని ప్రశ్నించారు.