- చివరి పోరుకు సిద్ధంపంచాయతీల్లో ఎన్నికలకు అంతా రెడీ
- పోలింగ్ సెంటర్లకు చేరుకున్న స్టాఫ్, సామగ్రి
- గొడవలు జరగకుండా భారీ బందోబస్తు
నల్గొండ/ యాదాద్రి, వెలుగు: గ్రామ పంచాయితీల్లో తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 465 గ్రామపంచాయతీలు, 3,657 వార్డు మెంబర్ల కోసం బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు మంగళవారం రాత్రివరకే సామాగ్రి, సిబ్బంది తరలింపు పూర్తయ్యింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు. సెన్సిటివ్సెంటరల్లో వెబ్కాస్టింగ్ చేస్తారు.
నల్గొండ జిల్లాలో..
నల్గొండ జిల్లాలో మూడవ విడతలో దేవరకొండ డివిజన్ లోని చందం పేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పెద్ద అదిశర్లపల్లి మండలాల్లోని 269 గ్రామ పంచాయితీలు, 2206 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 42 ఏకగ్రీవం కాగా, 227 పంచాయతీల్లో 720 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 596 వార్డులు ఏకగ్రీవంకాగా 1603 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 4,299 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
సూర్యాపేట జిల్లాలో ..
సూర్యాపేట జిల్లాలో మూడవ విడతలో హుజూర్ నగర్ డివిజన్ పరిధిలోని చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్ నగర్, మట్టంపల్లి, మేళ్లచెర్వు, నేరేడు చర్ల, పాలకీడు మండలాల్లోని 181 గ్రామపంచాయతీలు, 1,318 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 22 గ్రామాలు ఏకగ్రీవం కాగా 124 గ్రామ పంచాయితీలకు 375 మంది బరిలో ఉన్నారు. 257 వార్డ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 1061 వార్డులకు 2533 మంది పోటీలో ఉన్నారు.
యాదాద్రి జిల్లాలో..
యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు మండలాల్లోని 124 పంచాయతీలు, 1086 వార్డులకు గాను 10 మంది సర్పంచ్లు, 93 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు. దీంతో 114 పంచాయతీల్లో 378 మంది సర్పంచ్ అభ్యర్థులు, 993వార్డుల్లో 2302 మంది పోటీలో ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడవ విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లాలో 83, సూర్యాపేట జిల్లాలో 45 రూట్లను ఏర్పాటు చేసి మంగళ వారం మధ్యాహ్నం నుంచే సిబ్బంది, ఎన్నికల సామగ్రిని పోలింగ్ సెంటర్లకు తరలించారు. నల్గొండ జిల్లాలో 158, సూర్యాపేట జిల్లాలో 116 పెద్దవాహనాలు, నల్గొండ జిల్లాలో 60, సూర్యాపేట జిల్లాలో 53 చిన్న వాహనాలను ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లాలో 2,647మంది పీఓలు, 2,959 మంది ఓపీఓలు, 81 మంది స్టేజ్-2 అధికారులు, 83 మంది రూట్ఆఫీసర్లు, 89 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహించనున్నారు. 2,647 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 1,538 మంది పీఓలు, 2,026 మంది ఓపీఓలు, 147 మంది స్టేజ్-2 అధికారులు, 50 మంది రూట్ఆఫీసర్లు, 57 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 1,204 బ్యాలెట్బాక్సులను సిద్ధం చేశారు.
యాదాద్రి జిల్లాలో జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, పీవోలు, ఓపీవోలతో పాటు స్టాఫ్ చేరుకున్నారు. ఎన్నికల విధుల్లో 2,457 మంది స్టాఫ్పాల్గొంటున్నారు. 1056 పోలింగ్ స్టేషన్లకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సహా 53 రకాల సామగ్రి చేరుకున్నాయి. సెంటర్ల ఎదుట గుర్తులు, అభ్యర్థుల పేర్లతో పోస్టర్లను ఏర్పాటు చేశారు.
సూర్యాపేట జిల్లా ఓటర్ల వివరాలు..
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
చింతలపాలెం 12,740 13,316 0 26,056
గరిడే పల్లి 20,348 21,630 7 41,985
హుజూర్ నగర్ 10,013 10,454 0 20, 467
మట్టంపల్లి 17,104 18,161 0 35,265
మేళ్లచెర్వు 14,520 15,158 0 29,678
నేరేడు చర్ల 9,942 10,608 0 20,550
పాలకీడు 8,991 9,625 0 18,616
మొత్తం 93,658 98,952 7 1,92,617
యాదాద్రి జిల్లా ఓటర్ల వివరాలు..
మండలం పురుషులు మహిళలు మొత్తం
అడ్డగూడూరు11,320 11,702 23,022
చౌటుప్పల్ 18,800 19,093 37,893
గుండాల 13,152 12,917 26,069
మోటకొండూరు10,397 10,504 20,901
మోత్కూరు 6528 6687 13,215
నారాయణపూర్ 19,167 19,022 38,199
మొత్తం 79,364 79,925 1,59,289
నల్గొండ జిల్లా ఓటర్ల వివరాలు..
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
చందం పేట 12,935 12,157 01 25,093
చింతపల్లి 21,227 21,421 03 42,651
దేవరకొండ 16,511 16,456 01 32,968
గుడిపల్లి 6,066 6,205 00 12,271
గుండ్లపల్లి 19,550 19,839 02 39,391
గుర్రంపోడు 18,947 19,623 01 38,571
కొండ మల్లేపల్లి 12,993 12,779 03 25,775
నేరేడుగొమ్ము 9,601 9,290 03 18,894
పెద్ద అదిశర్లపల్లి 12,357 12,339 06 24,702
మొత్తం 1,30,187 1,30,109 20 2,60,316
