టేకులపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఆయన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఐటీడీఏ ద్వారా మంజూరైన మొక్కంపాడు - పూబెల్లి రోడ్డు, మద్రాస్ తండా - మేల్లమడుగు గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
కోయగూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, ఐటీడీఏ పీవో రాహుల్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో మల్లేశ్వరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు అభినందన
ఖమ్మం టౌన్: ఖమ్మం రాపర్తి నగర్లోని తెలంగాణ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీస్లో బుధవారం విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.

