- బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగానే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
రోజు రోజుకు బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, కేంద్ర ప్రభుత్వ పనితీరును కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కావాలనే మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఉదయనిధి కామెంట్లను ఇండియా కూటమిలోని డీఎంకే, ఇతర పార్టీలు ఖండించకపోవటం బాధాకరమని పొంగులేటి పేర్కొన్నారు.