భూ నిర్వాసితుల జీవితాలతో ఆటలాడుతున్నారు

భూ నిర్వాసితుల జీవితాలతో ఆటలాడుతున్నారు

బీజేపీ, టీఆర్ఎస్ లు కలిసి మిడ్ మానేరు భూ నిర్వాసితుల జీవితాలతో ఆటలాడుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం వేములవాడలోని నంది కమాన్ దగ్గర ధర్నాకు పిలుపునిస్తే.. పోలీసులు అనుమతి రద్దు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక ఎమ్మెల్యే రమేష్ బాబు, మంత్రి కేటీఆర్ హస్తం ఉందని మండిపడ్డారు. 

ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి చేతులెత్తేయడంతోనే.. హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యేపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.