- ఫుడ్ ఇన్స్పెక్టర్లు పోతలె.. తనిఖీలు చేస్తలె!
- బల్దియాకు రోజూ 15 నుంచి 20 వరకు ఫిర్యాదులు
- నాసిరకం నూనె వాడకం
- 90 శాతం వరకు స్ట్రీట్ ఫుడ్సెంటర్లలోనే వినియోగం
బంజారాహిల్స్లోని భీమాస్ హోటల్లో ఫుడ్ క్వాలిటీ లేదంటూ సిటిజన్మహ్మద్ అమీర్ కొద్దిరోజుల కిందట మంత్రి కేటీఆర్, ఖైరతాబాద్ జోనల్కమిషనర్ కు ట్విట్టర్ లో ఫొటో సహా పోస్ట్ చేసిండు. ఇడ్లి ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వచ్చిందని, హోటల్పై చర్యలు తీసుకుని పబ్లిక్ హెల్త్కాపాడాలని కోరిండు.’’
జొమాటో ద్వారా ఆన్లైన్లో ఫుడ్ఆర్డర్ చేశా. డెలివరీ అయ్యాక ప్యాకెట్విప్పి చూస్తే ఫుడ్ వాసన వచ్చింది. ఆ రెస్టారెంట్ ని జొమాటో నుంచి తొలగించాలంటూ గత నెలలో సోషల్ మీడియా లో సిటిజన్ వినోద్ పోస్ట్ చేసిండు.’’
హైదరాబాద్, వెలుగు: సిటీలో హోటల్స్, రెస్టారెంట్స్, స్ర్టీట్ ఫుడ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన బల్దియా పెద్దగా పట్టించుకోవడంలేదు. కస్టమర్లు కంప్లయింట్లు చేస్తుంటేనే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్ లు ఎలా చేస్తున్నరనేది స్పష్టమవుతుంది. హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్టేస్ట్ బాగా లేదని, నాణ్యత ఉండట్లేదని, పాడైన ఫుడ్ సర్వ్ చేస్తున్నారంటూ మై జీహెచ్ఎంసీ యాప్, హెల్ప్ లైన్ నంబర్, డయల్100, ట్విట్టర్తో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు డైలీ 15 నుంచి 20 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. మూడు నెలల్లోనే దాదాపు 280 పైగావచ్చాయి. ఫిర్యాదులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లోనే ఫుడ్ ఇన్స్పెక్టర్లు హడావుడి చేస్తూ శాంపిల్స్తీసుకుని పక్కన పడేస్తున్నారు. సిటీ అంతటా ఫోకస్ పెట్టడంలేదు. బల్దియా ఫుడ్సేఫ్టీ వింగ్లో ప్రస్తుతం 21 మంది ఆఫీసర్లు ఉన్నా పరిస్థితి లో మార్పు లేదు. అమ్మకాలు తక్కువగా ఉన్న కొన్ని హోటల్స్ నిర్వాహకులు ఆన్లైన్ ఆర్డర్లకు రాత్రిపూట మిగిలిన ఫుడ్ని మరుసటి రోజు వేడి చేసి పంపుతున్నారన్న ఆరోపణలున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ఫుడ్ త్వరగా పాడయ్యే అవకాశముంది.
ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే..
హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో వెళ్లి తింటుంటారు. మరికొందరు ఆన్ లైన్లో ఫుడ్ఆర్డర్ చేస్తుంటారు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు నాన్వెజ్ మిగిలితే మరుసటి రోజు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఆర్డర్ చేసిన కస్టమర్కు పంపిస్తుండగా టేస్ట్ చేంజ్అవుతోంది. ఆన్లైన్ ఆర్డర్లో ఎవరు చూస్తారంటూ కొందరు పంపుతుండగా ఫుడ్ టేస్ట్గా ఉండకపోతుండగా, ఆన్లైన్ ఫుడ్ బుకింగ్ చేసుకునే వారు కూడా బయటకు వెళ్లి తింటున్నట్లు చెబుతున్నారు.
సూపర్ మార్కెట్లలో తనిఖీల్లేవ్..
సూపర్ మార్కెట్లలో తనిఖీలు చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు. ఆఫర్ పెట్టే వస్తువుల క్వాలిటీని అంతగాపట్టించుకోవడంలేదు. ఇవి కాకుండా అమ్మకాలు తక్కువగా ఉన్న మెటిరియల్ని కూడా సూపర్మార్కెట్ల నిర్వాహకులు ఎప్పటికప్పుడు స్టాక్ ఎలా ఉందని చూడడం లేదు. దీంతో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి తినే సమయంలో పాడవుతున్నాయి. ఈ విషయంపై ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కంప్లయింట్స్వచ్చినా కూడా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రష్యా-– ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రస్తుతం లీటర్ మంచి నూనె ధర రూ.250 దాటింది. నాణ్యతలేని నూనెలను వాడుతున్నట్టు తెలుస్తోంది. స్ర్టీట్ఫుడ్ సెంటర్లలో అయితే 90 శాతం వరకు నాసిరకం నూనెలనే వినియోగిస్తున్నారు. కస్టమర్లు అడిగితే ధరలు పెరిగితే ఏం చేస్తామని సమాధానం ఇస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్ చేస్తున్నం.. బల్దియా ఫుడ్ ఇన్స్పెక్టర్
హోటల్స్, రెస్టారెంట్లలో వాడే నూనెల నాణ్యతపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని బల్దియాలోని ఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. ప్రస్తుతం నూనెల రేట్లు పెరగడంతో నాణ్యతలేనివి వాడుతున్నట్టు తమ దృష్టికి కూడా వచ్చిందని, దీంతో సిటీ అంతటా ఫోకస్ చేసినట్టు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లలో రెగ్యులర్గా శాంపిల్స్ సేకరించి తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
వీటిపైనే ఎక్కువగా ఫిర్యాదులు
హోటల్స్, మెస్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాప్స్, ఫాస్ట్ ఫుడ్సెంటర్లు, బేకరీల్లోని ఫుడ్పై బల్దియాకు ఎక్కువగా కంప్లయింట్లు వస్తున్నాయి. ఈ నెలలో వచ్చిన వాటిలో వీటిపైనే ఎక్కువగా ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్సెంటర్లలో ఆయిల్ మంచిది వాడటం లేదని, స్వీట్ షాప్ లో స్వీట్స్ తీసుకుంటే వాసనవస్తున్నాయని, మెస్లో భోజనం టేస్ట్గా లేదని, రెస్టారెంట్లలో చికెన్ తీసుకెళ్తే బాగాలేదని, కుళ్లిపోయిన ఫుడ్ని అందిస్తున్నారని జనాల నుంచి ఎక్కువగా ఇలాంటి ఫిర్యాదులు ఉంటున్నాయి. ఆన్ లైన్లోను ఆర్డర్ చేసిన ఫుడ్, పార్సిల్ తీసుకెళ్లినా రుచిగా ఉండటం లేదంటూ ఫొటోలను తీసి కంప్లయింట్ చేస్తున్నారు.