- లాక్డౌన్ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాన్స్
- అర్హత కలిగిన వారికి మాత్రమే..
- క్లాసిఫైడ్ ఫైళ్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు
- డ్రాఫ్ట్ గైడ్లైన్స్ను సిద్ధం చేసిన డీవోపీటీ
- ఈ నెల 21లోగా డ్రాఫ్ట్పై సూచనలు ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఏడాదికి 15 రోజుల చొప్పున అర్హత కలిగిన ఆఫీసర్లు/స్టాఫ్కు ఈ ఆప్షన్ను ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు వర్క్ఫ్రం హోంకు సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) సిద్ధం చేసింది. డ్రాఫ్ట్ గైడ్లైన్స్పై ఈ నెల 21 లోగా తమ స్పందన తెలియజేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. ఎవరైనా స్పందించకపోతే డ్రాఫ్ట్ గైడ్లైన్స్ను ఆ శాఖలు ఆమోదించినట్టు భావిస్తామని స్పష్టం చేసింది.
మెజారిటీ డిపార్ట్మెంట్లలో వర్క్ ఫ్రం హోం
ప్రస్తుతం 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అన్ని డిపార్ట్మెంట్స్లో సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరైందని డీవోపీటీ పేర్కొంది. ‘‘కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్స్ కరోనాపై పోరాటంలో పోరాటం చేస్తున్నాయి. లాక్డౌన్ పిరియడ్లో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) కల్పిస్తున్న ఈ–ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలను సక్సెస్ఫుల్గా వాడుకుంటున్నాయి” అని చెప్పింది. భవిష్యత్తులో పని చేసే చోట ఫిజికల్ డిస్టెన్స్ పాటించేందుకు దఫదఫాలుగా హాజరు, షిఫ్ట్ లను అమలుకు సెంట్రల్ సెక్రటేరియట్ సన్నాహాలు చేస్తోందని తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత వర్క్ఫ్రం హోం అమలుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్ వోపీ) ఫ్రేం వర్క్ను సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొంది.
డ్రాఫ్ట్ గైడ్లైన్స్లో కొన్ని..
- ఉద్యోగులు స్మూత్గా, ఇబ్బందులు లేకుండా పనిచేసేందుకు వీలుగా కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ను ఫైనల్ చేయాల్సి ఉంది.
- ఉద్యోగులకు సంబంధిత శాఖలు/డిపార్ట్మెంట్లు ల్యాప్టాప్/డెస్క్టాప్ అందించాలి. రొటేషన్ బేసిస్లో ల్యాప్టాప్లను అందజేయాలి. వర్క్ఫ్రం హోంలో ఇతర లాజిస్టిక్ సపోర్ట్ను కూడా అందించాలి.
- వర్క్ఫ్రం హోం కోసం ఇంటర్నెట్ సర్వీసులను వాడుకున్నందుకు రీయింబర్స్మెంట్ చేయాలి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక గైడ్లైన్స్ను జారీ చేయాలి.
- వీఐపీ, పార్లమెంట్ మ్యాటర్లకు సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందు కోసం ప్రత్యేక ప్రొటోకాల్ను ఫాలో కావాలి.
- వేరే అధికారి దగ్గరకు ఫైల్ చేరిందా లేదా అనే విషయం తెలిసేలా ఎస్ఎంఎస్లు పంపాలి.
- ఇప్పటి వరకూ ఈ–ఆఫీస్ మాడ్యూల్వాడని మినిస్ట్రీలు/డిపార్ట్మెంట్లు.. తమ సెక్రటేరియట్లలో నిర్దిష్ట సమయంలో దానిని అమలులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి.
- ఈ–ఆఫీస్ అంటే ఆఫీస్ వర్క్ను డిజిటైజ్/కంప్యూటరైజ్చేయడం అన్నమాట. ప్రస్తుతం 75 మినిస్ట్రీలు/డిపార్ట్మెంట్లు ఈ ఆఫీస్ ప్లాట్ఫాంను వాడుతున్నాయి. 57 డిపార్ట్మెంట్లు 80 శాతం పనిని దీని ద్వారానే చేస్తున్నాయి.
- ఈ–ఆఫీస్ ను వాడి వర్క్ఫ్రం హోం ద్వారా క్లాసిఫైడ్ ఫైల్స్/పేపర్లకు సంబంధించిన వ్యవహారాలను చేయడానికి వీలు లేదు.
- హోం శాఖతో సంప్రదించిన తర్వాత ఎన్ఐసీ ఈ ఆఫీస్ ద్వారా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్/ఫైల్స్ ను యాక్సెస్ చేయడానికి అవసరమైన గైడ్లైన్స్ను, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ప్రతిపాదిస్తుంది. సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసిజర్(సీఎస్ఎంవోపీ) నిర్దేశించిన స్టాండ్లోన్ కంప్యూటర్లలోనే క్లాసిఫైడ్ ఫైళ్లను యాక్సెస్ చేయడానికి వీలవుతుంది.
- ఆఫీసర్లకు ఇచ్చే ల్యాప్టాప్లలో అఫీషియల్ వర్క్ మాత్రమే చేయాలి. సొంత పనులకు వాడుకోకూడదు. ఈ డివైజ్లు మాల్వేర్, మాలిసియస్ వెబ్సైట్ల బారిన పడకుండా అవసరమైన ప్రొటెక్షన్ చర్యలను ఎన్ఐసీ చూసుకుంటుంది.
- పర్సనల్ కంప్యూటర్లు/ల్యాప్టాప్లపై పనిచేసే వారు తప్పనిసరిగా రెగ్యులర్ అప్డేట్లను, యాంటి వైరస్ స్కాన్లను చేయడం, మాలిసియస్ సైట్లను బ్లాక్ చేయడం చేయాలి. ఎన్ఐసీ సాయంతో తమ డివైజ్లోని సమాచారం చోరీ జరక్కుండా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి.
- వర్క్ఫ్రం హోం చేసే అధికారులు పైఆఫీసర్ల డైరెక్షన్లు, సూచనల కోసం ఫోన్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
- వివిధ శాఖల మధ్య సంప్రదింపులు, ఫైళ్ల మార్పిడి ఈఆఫీస్ ద్వారా సీమ్లెస్గా జరగాలి.
- వర్క్ఫ్రం హోం చేసే సమయంలో ఇంపార్టెంట్ మీటింగ్లకు అటెండ్ కావడానికి ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీని వాడుకోవాలి. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేందుకు, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టుగా పని చేసేందుకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి.